డైరెక్టర్ రాంగోపాల్ వర్మకు స్వల్ప ఊరట

Update: 2018-02-23 06:16 GMT

జీఎస్టీ షార్ట్ ఫిల్మ్, సామాజిక కార్యకర్త దేవిపై అనుచిత వ్యాఖ్యల కేసుల్లో డైరెక్టర్ రాంగోపాల్‌వర్మకు స్వల్ప ఊరట లభించింది. ఇవాళ సీసీఎస్‌ పోలీసుల ముందు హాజరుకావాల్సి ఉండగా, మార్చి ఫస్ట్‌ వీక్‌లో రావాలంటూ వర్మకు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఫోన్లో సమాచారమిచ్చారు. వర్మ ల్యాప్‌‌ట్యాప్‌ విషయంలో ఎఫ్‌ఎస్‌‌ఎల్‌ రిపోర్ట్‌ ఆలస్యం కావడంతోనే పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎఫ్‌ఎస్‌‌ఎల్‌ రిపోర్ట్‌ అందితే వర్మకు కొత్త ప్రశ్నలు సంధించడానికి వీలవుతుందని భావిస్తున్నారు. 
 

Similar News