కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి ఊహించని అడ్డంకి!

Update: 2018-05-23 10:28 GMT

కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ఈ సాయంత్రం 4.30 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమం కోసం విధానసౌధ ముందు ఓ భారీ వేదికను ఏర్పాటు చేశారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, చంద్రబాబు, శరద్ పవార్, కేజ్రీవాల్, మాయావతి, అఖిలేష్ యాదవ్ లాంటి ఎందరో ప్రముఖులు తరలి వస్తుండటంతో భారీ ఎత్తున వేదికను రూపొందించారు.  కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేయనున్న తరుణంలో బెంగళూరులో అకస్మాత్తుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. విధానసౌధ వద్ద ప్రమాణ స్వీకారం నిమిత్తం ఏర్పాటు చేసిన వేదిక వద్ద కూడా భారీగా వర్షం కురుస్తోంది. దీంతో ప్రమాణ స్వీకార కార్యక్రమంపై నీలినీడలు కమ్ముకున్నాయి. వర్షం తీవ్రత తగ్గిన తర్వాత ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుందా లేక వాయిదా పడుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Similar News