ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ రాష్ట్రానికి రానున్నారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించే సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు జరగనున్న ఈ సభ నిర్వహణను బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అటు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా రాష్ట్రానికి రానున్నారు. ఆయన గద్వాల, తాండూరు బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు. తర్వాత హైదరాబాద్లోని జూబ్లీహిల్స్, కూకట్పల్లిలో రోడ్షోలో పాల్గొంటారు. టీడీపీ అధినేత చంద్రబాబు, రాహుల్ మరోసారి సంయుక్తంగా ఎన్నికల ప్రచారం చేయనున్నారు. జూబ్లీహిల్స్, కూకట్పల్లి, రహ్మత్నగర్, మూసాపేట సభల్లో పాల్గొంటారు.