కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని అరెస్ట్ చేశారు. సీబీఐ ఆఫీసు వద్ద ఆందోళనలో పాల్గొన్న రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ అగ్రనేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఆలోక్ వర్మను సెలవుపై పంపిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్ష కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై నేడు దేశవ్యాప్తంగా నిరసనకు దిగింది. దేశంలోని అన్ని సీబీఐ కార్యాలయాల ఎదటు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. దిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయం వద్ద కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ ఆందోళనలో పాల్గొన్నారు. రాహుల్తో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆనంద్ శర్మ, వీరప్ప మొయిలీ, సీపీఐ నాయకులు డి. రాజా, శరద్ యాదవ్ తదితరులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ఆందోళనల నేపథ్యంలో సీబీఐ ప్రధాన కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో భారీగా మోహరించిన కేంద్ర బలగాలు, పోలీసులు నిరసనకారులను అడ్డుకున్నారు. రాహుల్ సహా ఇతర నేతలను కూడా అరెస్టు చేశారు.