హైదరాబాద్లో పోలీసుల రక్షక్ వాహనం జీహెచ్ఎంసీ కార్మికురాలి ప్రాణాలు తీసింది. రెయిన్ బజార్ బ్రాహ్మన్వాడీలో రోడ్డు ఊడుస్తున్న పారిశుధ్య కార్మికురాలిని పోలీసు వెహికల్ ఢి కొట్టింది. జీహెచ్ఎంసీ కార్మికురాలు రోడ్డు ఊడుస్తుండగా... ఆమెపైకి దూసుకుపోయింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. కార్మికురాలి మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.