దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. లీటర్ పెట్రోల్పై 18 పైసలు, డీజిల్పై 29 పైసలు పెరిగాయి. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 81.68 కి చేరింది. డీజిల్ ధర 73.79 కి చేరింది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర 87.15, డీజిల్ ధర 76.75 ఉండగా.. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర 86.58 . డీజిల్ ధర 79.55 పైసలకు చేరింది. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సంకాన్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నప్పటికీ చాలా రాష్ట్రాల్లో...తగ్గిన ధరలు అమలులోకి రాలేదు. డైనమిక్ ప్రైసింగ్ మెకానిజమ్ ప్రకారం పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి.