రేపు తెలంగాణ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ భేటీ అయ్యారు. రాహుల్ పిలుపు మేరకు ఈ ఉదయం ఢిల్లీ వెళ్లిన ఉత్తమ్..ఎన్నికల ఫలితాల తరువాత పరిణామాల గురించి చర్చించారు. తెలంగాణ అసెంబ్లీ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి..జాతీయ, స్థానిక సంస్థల ఎగ్జిట్ పోల్స్ గురించి రాహుల్, ఉత్తమ్ సమాలోచనలు జరపారు. ప్రజా కూటమి అభ్యర్థుల విజయావకాశాలు ఎలా ఉన్నాయో రాహుల్ ఆరా తీశారు.