ఇప్పటివరకు హైదరాబాద్ కేంద్రంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న జనసేనాని పవన్ కళ్యాన్ విజయవాడకు మకాం మార్చారు. పడమటలో నూతనంగా తీసుకున్న అద్దె నివాసంలో కుటుంబ సమేతంగా కాలు పెట్టారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన ..ఇకపై అన్ని కార్యక్రమాలు విజయవాడ నుంచే కొనసాగిస్తారని పార్టీ వర్గాలు తెలియజేశాయి. ఇందుకోసం ఇంట్లోనే పార్టీ, మీడియా సమావేశాలు నిర్వహించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. ఈ నెల 26 నుంచి తిరిగి ప్రారంభించనున్న పోరాట యాత్రకు పవన్ ఇక్కడి నుంచే బయలుదేరుతారు.