బెజవాడకు పవన్ షిఫ్ట్

Update: 2018-06-22 06:04 GMT

ఇప్పటివరకు హైదరాబాద్ కేంద్రంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న జనసేనాని పవన్ కళ్యాన్‌ విజయవాడకు మకాం మార్చారు. పడమటలో నూతనంగా తీసుకున్న అద్దె నివాసంలో కుటుంబ సమేతంగా కాలు పెట్టారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన ..ఇకపై అన్ని కార్యక్రమాలు విజయవాడ నుంచే కొనసాగిస్తారని పార్టీ వర్గాలు తెలియజేశాయి.  ఇందుకోసం  ఇంట్లోనే పార్టీ, మీడియా సమావేశాలు నిర్వహించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. ఈ నెల 26 నుంచి తిరిగి ప్రారంభించనున్న పోరాట యాత్రకు పవన్ ఇక్కడి నుంచే బయలుదేరుతారు.  

Similar News