విశాఖ జిల్లా పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాజీ మంత్రి దాడి వీరభద్రరావుతో భేటీ అయ్యారు. ఈ మధ్యాహ్నం అనకాపల్లిలోని దాడి నివాసానికి వెళ్లిన పవన్.. ఆయన ఇచ్చిన విందుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై వీరిద్దరూ చర్చించినట్టు సమాచారం. పవన్కళ్యాణ్కు దాడి వీరభద్రరావు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. వీరి భేటీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.