ప్రకాశం జిల్లా జెడ్పీ సమావేశం రసాభాసాగా మారింది. బిల్లుల మంజూరు విషయంలో ఛైర్మెన్ ఏక పక్షంగా వ్యవహరిస్తున్నారంటూ ఎంపీపీలు నిలదీయడంతో సమావేశం మొత్తం గందరగోళంగా మారింది. బడ్జెట్ నిధులు పక్కదారి పట్టిస్తున్నట్లు ఆరోపిస్తూ చాంభర్ దగ్గరకు సభ్యులు దూసుకెళ్లడంతో ఓ సమయంలో ఉద్రిక్తంగా మారింది. స్టాండింగ్ కమిటీ ఆమోదించినా ఎందుకు నిధులు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు. ఎంపీపీల నిరసనలు, నినాదాలతో సమావేశం మొత్తం గందరగోళంగా మారింది.