కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ ఎంపీ సుజనాచౌదరికి ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనకు జారీ చేసిన ఈడీ సమన్లను రద్దు చేయాలంటూ ఢిల్లీ హైకోర్టులో సుజనాచౌదరి వేసిన పిటీషన్ను.. ధర్మాసనం కొట్టేసింది. అంతేకాకుండా.. సోమవారం విచారణ నిమిత్తం.. ఈడీ ఎదుట హాజరుకావాల్సిందే అని ఆదేశించింది. అయితే ఆయనపై ఎటువంటి నిర్బంధ చర్యలు తీసుకోరాదని ఈడీని ఆదేశించింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తనను వేధిస్తోందని సుజన హైకోర్టుకు తెలిపారు. రాజకీయంగా కక్ష సాధిస్తోందని ఆరోపించారు.