టీఆర్ఎస్ నేత దాష్టికం..కోరిక తీర్చమంటూ యువతులపై..

Update: 2018-05-14 07:01 GMT

నిర్మల్ జిల్లా లోకేశ్వరంలో అధికార టీఆర్ఎస్‌కు చెందిన మెండే శ్రీధర్ రెచ్చిపోయారు.  సర్పంచ్ భర్త అయిన శ్రీధర్‌  కస్తూర్భా పాఠశాలలో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్న ఇద్దరు యువతులను తన కోరిక తీర్చాలంటూ వేధించాడు. ఇందుకు ఇద్దరు మహిళలు  తిరగబడటంతో .. ఉద్యోగంలో నుంచి తీయిస్తానంటూ హెచ్చరించాడు.  శ్రీధర్ తీరుతో  ఆందోళన చెందిన ఇద్దరు మహిళలు  పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఐపీసీ   506, 509 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.       

Similar News