హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

Update: 2018-11-25 15:11 GMT

కర్నాటకలో శనివారం జరిగిన బస్సు ప్రమాదం మరువకముందే హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం సిర్మౌర్‌లో ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి జలాల్‌ వంతెనపై నుంచి నదిలో పడింది. దాంతో 9 మంది అక్కడికక్కడే మరణించారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక బృందాలు హుటాహుటిన అక్కడికి చేరుకుని సహాయకార్యక్రమాలు ప్రారంభించారు. ప్రైవేటు బస్సు శ్రీ రేణుకాజీ ప్రాంతం నుంచి నాహాన్‌కు వెళుతున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగిందని తెలిసింది. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులున్నారు. గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు కారణం డ్రైవర్‌ నిర్లక్షమే అని తెలుస్తోందని అడిషనల్‌ ఎస్పీ వీరేంద్ర సింగ్‌ ఠాకూర్‌ చెప్పారు.

Similar News