రాజన్న సిరిసిల్ల జిల్లాలో చందు గౌడ్ అనే వ్యక్తి పెట్రోల్ ధరల పెరుగుదలపై మండిపడుతున్నాడు. పెట్రోల్ ధరలు 9 పైసలు తగ్గడంతో తన ఆవేదనను ప్రదానికి తెలియజేయాలని భావించారు. వినూత్నంగా ఆలోచించి రంగంలో దిగాడు. ప్రధానికి తన నిరసనను తెలియజేసేందుకు పూనుకున్నాడు. ప్రధాని రిలీఫ్ ఫండ్కు 9 పైసలు చెక్ను విరాళంగా అందజేశాడు. సిరిసిల్ల ప్రజావాణిలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్కి చెక్ అందించాడు. ప్రధాని నరేంద్రమోడీకి అందజేయాలని కోరాడు.