తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం స్పష్టించిన కవల పిల్లల హత్య కేసులో తల్లిదండ్రుల ప్రమేయం లేదని పోలీసులు తేల్చారు. ఫోన్ కాల్స్తో పాటు వాట్సప్, మెసేంజర్ పరిశీలించిన పోలీసులు ఈ విషయంలో తల్లిదండ్రులకు సంబంధం లేదని గుర్తించారు. మానసిక వైకల్యంతో బాధపడుతున్నందునే ఇద్దరు పిల్లలను హత్య చేసినట్టు మేనమామ మల్లికార్జున రెడ్డి పోలీసుల విచారణలో వెల్లడించాడు. పిల్లల కోసం తన కుటుంబంలో కలహాలు కూడా వచ్చాయని ఇవన్నీ భరించలేకే హత్య చేసినట్టు పోలీసులకు వాంగ్మూలమిచ్చాడు. దీంతో మల్లికార్జున రెడ్డి ఐపీసీ 302తో ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.