అగ్రిగోల్డ్‌ కేసులో కీలక మలుపు

Update: 2018-11-16 11:35 GMT

అగ్రిగోల్డ్ కేసు కొత్త మలుపు తిరిగింది. హాయ్‌ల్యాండ్ ఆస్తి తమది కాదని అగ్రిగోల్డ్ ఎండీ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. విచారణలో ఈ విషయాన్ని ఇన్నాళ్లు ఎందుకు చెప్పలేదని అగ్రిగోల్డ్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఐడీపై దర్యాప్తు అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు సిట్ ఏర్పాటు చేసే, విచారణను తాము పర్యవేక్షిస్తామని తెలిపింది. హాయ్‌లాండ్‌ ప్రాపర్టీ తనేదని అలూరి వెంకటేశ్వర్లు హైకోర్టు తెలపడంతో కొత్త మలుపు తిరిగింది. కేసుపై సీఐడీ దర్యాప్తు సరిగ్గా లేదని మందలిస్తూ తదుపరి విచారణ ఈనెల 23కు వాయిదా వేసింది. 
 

Similar News