ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా మాణిక్యాలరావు ?

Update: 2018-03-29 09:40 GMT

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి మాణిక్యాలరావును అధిష్ఠానం ఖరారు చేసినట్లు సమాచారం. ఒకటి రెండు రోజుల్లో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మాణిక్యాలరావు పేరు అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయ్. 2019 ఎన్నికల్లో దూకుడుగా వెళ్లాలన్న లక్ష్యంతో కంభంపాటి హరిబాబును పక్కన పెట్టి అధ్యక్ష పదవిని మాణిక్యారావుకు అప్పగిస్తున్నట్లు తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత చంద్రబాబు కేబినెట్‌‌లో దేవదాయ, ధర్మదాయ శాఖ మంత్రిగా సుమారు నాలుగేళ్ల పాటు పని చేశారు. టీడీపీ కేంద్ర మంత్రివర్గం నుంచి బయటకు రావడంతో రాష్ట్రంలో బేజేపీ మంత్రులు పదవులకు రాజీనామా చేశారు. 

Similar News