ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్(నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్) 2018 పరీక్ష ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. షెడ్యూల్ ప్రకారం (జూన్ 5)న ఫలితాలు విడుదల కావాల్సి ఉండగా, దానికి ఒకరోజు ముందుగానే ఈ రోజు మధ్యాహ్నం సీబీఎస్ఈ బోర్డు ఫలితాలను వెల్లడించింది. ఫలితాల కోసం cbseneet.nic.in, cbseresults.nic.inను క్లిక్ చేయవచ్చు. నీట్ ఫలితాలను వాయిదా వేయాలంటూ, స్టే ఇవ్వాల్సిందిగా కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో ఒకరోజు ముందుగానే సీబీఎస్ఈ నీట్ ఫలితాలను వెల్లడించింది. ఈ రోజు వెల్లడైన నీట్ ఫలితాల్లో కల్పనా కుమారి నీట్ ఆలిండియా టాపర్గా నిలిచారు. 720 మార్కులకు గానూ 690 మార్కులు పొందిన కల్పనా కుమారి 99.99 శాతంతో ఫస్ట్ర్యాంకు సాధించారు.