అధికారులకు లోకేష్ వార్నింగ్

Update: 2018-10-16 09:31 GMT

విపత్తు సంభవించినప్పుడు ప్రజలకు అండగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పంచాయితీరాజ్‌ మంత్రి లోకేష్‌ అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన లోకేష్‌ బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మూడు రోజులుగా మందసలోనే మకాం వేసిన లోకేష్‌ ప్రజలతో మమేకమై సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. తుపాను బాధితుల సహాయక చర్యల్లో అలసత్వం వహిస్తే అధికారులపై చర్యలు తప్పవన్నారు మంత్రి లోకేష్‌.
 

Similar News