ఏపీకి జరిగిన అన్యాయంపై తాను రాజీనామాకు సిద్ధమని ఎంపీ రాయపాటి సాంబశివరావు సంచలన ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం అనంతరం తన నిర్ణయం ప్రకటిస్తానని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంపీలకు ఎంతో విలువ ఉండేదని కానీ, ఆర్ఎస్ఎస్ ఏది చెబితే బీజేపీ ప్రభుత్వం అదే చేసే పరిస్థితిలో ఉందని ఆయన విమర్శించారు. ఇప్పుడు ఢిల్లీలో ఎంపీలను హీనంగా చూస్తున్నారని, ఏపీకి అన్యాయం చేస్తే కాంగ్రెస్కు పట్టిన గతే బీజేపీకి పడుతుందని హెచ్చరించారు. బీజేపీపై ప్రజలలో తీవ్ర ఆగ్రహం ఉందని రాయపాటి విమర్శలు గుప్పించారు.