బోధన్ మున్సిపల్ ఛైర్మన్పై అవిశ్వాస తీర్మానం పెట్టిన కౌన్సిలర్లు విందు వినోదాల్లో మునిగి తేలుతున్నారు. టీఆర్ఎస్ అసమ్మతి కౌన్సిలర్లు ఓటింగ్ దూరంగా ఉండేలా ఒప్పించిన అగ్రనేతలు వారిని చెన్నైలోని ఓ హోటల్ కి తరలించడంతో అక్కడ మందు, విందుతో ఎంజాయ్ చేస్తున్నారు. బోధన్ మున్సిపల్ ఛైర్మన్ పై 29మంది కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఈనెల 25న చర్చ జరగనుండగా ఎంపీ కవిత చొరవతో వారంతా యూటర్న్ తీసుకున్నారు. అసమ్మతి కౌన్సిలర్లంతా ఓటింగ్ కి దూరంగా ఉండాలని నిర్ణయించారు. దీంతో వారి మనసు మారకుండా ఉండేందుకు చెన్నైలోని ఓ హోటల్ కి తరలించారు.