ఉర్జిత్ పటేల్, ఆర్బీఐ గవర్నర్ గా రాజీనామా చేసిన విషయం తెలిసిందే అయితే ఆదే విషయంపై తాజాగా భారతదేశ ప్రధాన మంత్రి మోడీ స్పందించారు. అత్యంత ఆందోళనకరంగా ఉన్న బ్యాంకింగ్ వ్యవస్థను ఉర్జిత్ ఓ దిశకు తీసుకువచ్చారని, ఉర్జిత్ పటేల్ కు స్థూల ఆర్థిక అంశాలపై చాలా లోతనైన అవగాహన ఉందని ప్రధాని తన ట్వీట్లో తెలిపారు. కాగా దినిపై ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా స్పందించారు. ఉర్జిత్ సేవలను తప్పకుండా ప్రభుత్వం గుర్తిస్తుందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ట్వీట్ చేశారు. పబ్లిక్ సర్వీసులో మరి కొన్ని సంవత్సరాలు ఆయన ఉండాలని జైట్లీ తెలిపారు.