తనకు వివరణ ఇచ్చేందుకు మండలి చైర్మన్ అవకాశం ఇవ్వాలన్నారు కాంగ్రెస్ నేత భూపతిరెడ్డి. పార్టీ ఫిరాయింపులపై చర్యలు ఎందుకు తీసుకోకూడదో తెలుపాలంటూ చైర్మన్ స్వామిగౌడ్ నుంచి 18న నోటీసు వచ్చిందన్నారు. వరుస సెలవులతో వివరణ ఇచ్చేందుకు అవకాశం లభించలేదని వివరణ ఇచ్చేందుకు అవకాశం కల్పించాలని భూపతిరెడ్డి కోరారు. అలాగే తనకు న్యాయం జరిగే వరకు న్యాయ పోరాటం చేస్తానన్నారు కాంగ్రెస్ నేత రాములు నాయక్. మండలి చైర్మన్ టీఆర్ఎస్ లో చేరిన వారిపై చర్యలు తీసుకోకుండా.. తమపై చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. గవర్నర్ కోటాలో వచ్చిన ఫారూఖ్ హుస్సేన్ పై చర్యలు తీసుకోవాలని ప్రశ్నించారు రాములు నాయక్.