పవన్‌కు గుండు కొట్టింది నిజమే: రోజా

Update: 2017-12-15 06:20 GMT

పవన్ కల్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో పరిటాల రవి పవన్ కల్యాణ్ కు గుండు కొట్టించారనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ వార్తను ఖండిస్తూ తనకు ఎవరు గుండు కొట్టించలేదని..తనకు తాను గుండు కొట్టించుకున్నానని పవన్ తెలిపారు. ఈ వ్యవహారంపై టీడీపీ నేతలు ప్రచారం చేశారని అన్నారు. 

ఇదిలా ఉంటే ఓ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన రోజా పవన్ కల్యాణ్ కు గుండు కొట్టించిన మాటవాస్తవమేనన్నారు. అప్పుడే కాదు 2014కొట్టించారు. 2019లో కూడా మళ్లీ కొట్టిస్తారని సెటైర్ వేశారు. గతంలో టీడీపీలోనే ఉన్నానని, అయితే ఆ విషయంలో తనకు ఎటువంటి సంబంధమూ లేదని తేల్చిచెప్పారు. పవన్ చెప్పిన తేదీలను బట్టి చూస్తే గుండు నిజమేనని నమ్మొచ్చన్నారు.పవన్ కల్యాణ్ ఈ విషయం తెలుసుకుని టీడీపీతో జాగ్రత్తగా ఉంటే మేలని సూచించారు.