హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ను పోలీసులు అరెస్టు చేశారు. గోవధకు వ్యతిరేకంగా పోరాడుతున్న తనపై తప్పుడు కేసులు పెట్టడాన్ని నిరశిస్తూ బషీర్ బాగ్ పోలీస్ కమిషనర్ కార్యాలయం దగ్గర నిరాహార దీక్షకు బయల్దేరిన రాజాసింగ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీపీ ఆఫీస్ దగ్గర వద్ద దీక్ష చేస్తానని రాజా సింగ్ ముందే ప్రకటించడంతో అర్ధరాత్రి నుంచే పోలీసులు ఎమ్మెల్యే ఇంటి దగ్గర మోహరించారు. రాజా సింగ్ దీక్షకు బయల్దేరగానే అరెస్టు చేశారు. గోవధ ఆపే వరకు...తమపై బనాయించిన తప్పుడు కేసులు ఉపసంహరించే వరకు పోరాటం కొనసాగిస్తానని రాజాసింగ్ అన్నారు.