రామగుండంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచిన కోరుగంటి చందర్ కొద్దిసేపటి క్రితం కేటీఆర్ను కలిశారు. టీఆర్ఎస్ పార్టీకి తాను సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు. ఎన్నికల ముందు వరకూ తాను టీఆర్ఎస్లోనే ఉన్నానని, ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ నాయకత్వంలో పనిచేశానని చెప్పారు. టీఆర్ఎస్ తన మాతృ సంస్థ అని, కేసీఆర్ నాయకత్వంలో మళ్లీ పనిచేస్తానని చందర్ చెప్పారు.