ఏపీ పోలీసులు, అధికారులపై నమ్మకం లేదని చెబుతున్న ప్రతిపక్ష నేత జగన్కు ఈ రాష్ట్రంలో పోటీ చేసే హక్కు లేదని మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. దాడి జరిగిన వెంటనే జగన్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసి చికిత్స తీసుకోకుండా నవ్వుతూ విమానం ఎక్కి వెళ్లిపోవడమేంటని నిలదీశారు. కత్తి దాడి జరిగితే ఎవరైనా కంగారు పడతారని.. కానీ జగన్లో అలాంటి ఆందోళన ఏదీ కనిపించలేదన్నారు. తనపై దాడి జరిగి ఐదు రోజులైనా జగన్ స్పందించలేదని మీడియా ఎదుట మాట్లాడితే నిజాలు బయటపడతాయని కంగారు పడుతున్నారని నక్కా ఆనందబాబు ఆరోపించారు.