కోడిగుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్

Update: 2018-04-02 10:14 GMT

కాగ్ నివేదిక కాంగ్రెస్‌ నేతలు...కోడి గుడ్డు మీద ఈకలు పీకినట్లు మాట్లాడుతున్నారని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. కాగ్‌ నివేదికకు ప్రామాణికత లేదని ప్రధానిగా మన్మోహన్‌సింగ్‌ పార్లమెంట్‌లో చెప్పారని గుర్తు చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అప్పుల విషయంలో తప్పు పట్టని కాగ్‌....ఇతర రాష్ట్రాల్లో మాత్రమే తప్పు పడుతోందన్నారు. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడి పని చేసినపుడు....కాగ్‌ అనేక తప్పులను ఎత్తిచూపిందన్నారు. టెక్నికల్ అంశాల్లో మాత్రమే కొన్ని సూచనలు చేసిందని హరీశ్‌రావు గుర్తు చేశారు.

Similar News