భువనేశ్వర్లో దారుణం జరిగింది. ఓ కాలేజ్ విద్యార్థిని కొందరు అల్లరిమూకలు కలిసి ర్యాగింగ్ చేశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. కాలేజ్ అయిన తరువాత ఇంటికి వెళుతున్న సహచర విద్యార్థిని 6 మంది మృగాళ్లు పట్టపగలు, పదిమంది చూస్తుండగా అత్యంత నీచంగా లైంగిక వేధింపులకు దిగారు. అక్కడే ఉన్న ఒక విద్యార్థి ఈ ఘటన మొత్తాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది. ఒడిశాలోని బర్గడ్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. కాలేజ్ అయిన తరువాత తన స్నేహితుడితో కలిసి వెళ్తున్న అమ్మాయిని అందరూ కలిసి చుట్టుముట్టారు. చేతులతో తాకుతూ నానా ఇబ్బందులు పెట్టారు. విషయం బయటికి రావడంతో పోలీసులు కొందరు నిందితులను వెతికి పట్టుకుని, అరెస్ట్ చేశారు. మరికొందరి కోసం గాలిస్తున్నారు.