మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో మావోయిస్టుల పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. మావోయిస్టు అనుబంధ కార్మిక సంఘం సింగరేణి కార్మిక సమాఖ్య పేరుతో పలు చోట్ల పోస్టర్లు అతికించారు. కూరగాయల మార్కెట్, అంబేద్కర్ నగర్లో చాలా చోట్ల పోస్టర్లు అతికించారు. బూటకపు అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించాలని సింగరేణి కార్మిక సమాఖ్య పిలుపు నిచ్చింది. ఈ పోస్టర్లపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.