ఖైరతాబాద్ టికెట్టు కోసం టీఆర్ఎస్‌లో ఆగని నిరసనలు

Update: 2018-11-13 09:43 GMT

ఖైరతాబాద్ టికెట్టు కోసం టీఆర్ఎస్‌లో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఖైరతాబాద్ సీటు గురించి టీఆర్ఎస్ భవన్ దగ్గర ఆందోళన చేయడానికి బయల్దేరిన ఖైరతాబాద్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇంఛార్జ్ మన్నే గోవర్ధన్ రెడ్డితో పాటు ఆయన వర్గీయులను పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే కాలనీ నుంచి బయలుదేరిన ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరగింది. ఈ తోపులాటలో మన్నె గోవర్ధన్ రెడ్డి కింద పడిపోగా ఆయనకు ఛాతి నొప్పి వచ్చింది.  వెంటనే మన్నె గోవర్ధన్ రెడ్డిని పక్కనే ఉన్న సిటీ న్యూరో హాస్పిటల్ లో చేర్పించారు.

Similar News