ప్రేమపక్షుల ప్రణయగాధ పెళ్లితో పరిసమాప్తం

Update: 2018-12-15 04:19 GMT

ప్రేమపక్షుల ప్రణయగాధ పెళ్లితో పరిసమాప్తం అయింది. నటి శ్వేతా బసుప్రసాద్‌ వివాహం రోహిత్‌ మిట్టల్‌ తో గురువారం అంగరంగ వైభవంగా జరిగింది. ఐదేళ్ల కిత్రం ముంబైలో ఫాంటమ్‌ ఫిల్మ్స్‌లో శ్వేతా బసుప్రసాద్‌ పని చేస్తున్నప్పుడు... రోహిత్‌ ఆమెకు పరిచయం అయ్యారు. ఆ తరువాత మూడేళ్లకు ఇద్దరిమధ్య ఉన్న ప్రేమను ఒకరికొకరు చెప్పుకున్నారు. అయితే వీరి వివాహానికి మొదట కుటుంబసభ్యులు అంగీకరించలేదు. దాంతో ఇద్దరు కొంతకాలం సహజీవనం చేశారని అప్పట్లో రూమర్లు వచ్చాయి. అయితే ఇటీవల శ్వేతా, రోహిత్ ల వివాహానికి కుటుంబసభ్యులు పచ్చజెండా ఊపడంతో గురువారం వివాహం జరిగింది. కాగా ఈ వివాహానికి కుటుంబసభ్యులు, సన్నిహితులు మినహా ఇతరులెవ్వరు హాజరుకాలేదని సమాచారం.

Similar News