వైఎస్సార్ బయోపిక్‌పై దర్శకుడు క్లారిటీ

Update: 2018-03-09 05:33 GMT

‘ఆనందో బ్రహ్మా’ చిత్ర ద్వారా కమర్షియల్ హిట్ అందుకున్న దర్శకుడు మహి వి రాఘవ్ దర్శకత్వంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ తెరకెక్కనుందన్న విషయం తెలిసిందే. అలాగే ఈ సినిమాలో వైఎస్ పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కనిపించబోతున్నారని, అలాగే నయనతార మరో కీలక పాత్రలో నటిస్తున్నారని ఇటీవల వార్తలు హల్చల్ చేసిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఆ వార్తలపై స్పందించాడు దర్శకుడు. ఈ సినిమాలో మమ్ముట్టి, నయనతార నటిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన అన్నాడు. ప్రస్తుతం స్ర్కిప్ట్ పనులు జరుగుతున్నాయని.. ఇంకా నటీనటులను ఎంపిక చేయలేదని ఆయన చెప్పారు. కాగా ఈ చిత్రాన్ని విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించనున్నారు.

Similar News