మహాకూటమిలో సీట్ల సర్దుబాటు దాదాపు కొలిక్కి వచ్చింది. టీడీపీకి 14, టీజేఎస్ కి 08 ,సీపీఐ 4 స్థానాలు ఇచ్చే ఛాన్స్ ఉంది. సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్, ఏఐసీసీ రాష్ట్ర ఇంచార్జ్ కుంతియాలు వివరించారు. రేపు సోనియాగాంధీ నివాసంలో సెంట్రల్ కమిటీ సమావేశమై సీట్ల సర్దుబాటుపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. రాహుల్ గాంధీ ఆమోదంతో తొలిజాబితా ప్రకటించే అవకాశం ఉంది. 55 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్ ప్రకటిస్తారని తెలుస్తోంది.