సిలిగురి జిల్లాలో జనవాసాల్లోకి వచ్చిన చిరుత

Update: 2018-05-09 05:25 GMT

పశ్చిమ బంగాలోని సిలిగురి జిల్లాలో జనావాసాల్లోకి ఓ చిరుత చొచ్చుకొచ్చింది. సమీప అటవీ ప్రాంతం నుంచి జ్యోతి నగర్‌ ప్రాంతంలోకి వచ్చిన చిరుతను చూసి స్ధానికులు ఆందోళనకు గురయ్యారు. గ్రామ పరిసరాల్లోని పశువుల మందపై చిరుత దాడి చేయడంతో భయాందోళన చెందిన స్ధానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారమిచ్చారు. పాదముద్రల ఆధారంగా బోనులు ఏర్పాటు చేసిన అధికారులు చిరుతను బంధించారు. ఈ ప్రయత్నంలో చిరుత గాయపడటంతో పశువైద్యశాలకు తరలించి చికిత్సనందించారు.
 

Similar News