అగ్రిగోల్డ్‌ కేసులో మరో కీలక మలుపు

Update: 2018-06-05 11:26 GMT

అగ్రిగోల్డ్‌ కేసు మరో కీలక మలుపు తిరిగింది. అగ్రిగోల్డ్‌ ఆస్తుల కొనుగోలుకు ఆసక్తి చూపించి వెనక్కి తగ్గిన జీ-ఎస్సెల్‌ గ్రూప్‌‌.... ఇప్పుడు మళ్లీ కొనుగోలు చేయడానికి ముందుకొచ్చింది. ఆ మేరకు గతంలో దాఖలు వేసిన పిటిషన్‌ను జీ-ఎస్సెల్‌ గ్రూప్‌ ఉపసంహరించుకుంది.‌ ఇదిలా ఉంటే.... 10 అగ్రిగోల్డ్‌ ఆస్తులను సీఐడీ... హైకోర్టుకు సమర్పించింది. దాంతో సీఐడీ సమర్పించిన ఆస్తుల విలువ ఎంతో చెప్పాలని అగ్రిగోల్డ్‌కు హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 8కి వాయిదా వేసింది.
 

Similar News