సర్వేలపై క్లారిటీ ఇచ్చిన లగడపాటి

Update: 2018-07-31 07:32 GMT

ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని.. అది రాష్ట్రప్రజల బలమైన ఆకాంక్ష అని విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ అన్నారు. అనంతపురం జిల్లా పెనుకొండ మండలం కోనాపురంలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ప్రాణ త్యాగాలు, ఆత్మ బలిదానాలతో ప్రత్యేకహోదా రాదని.. పోరాటాల ద్వారానే ప్రత్యేకహోదా సాధ్యమన్నారు. ప్రస్తుతం తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని, కానీ ఎన్నికల సర్వేలు మాత్రం కొనసాగిస్తానని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పేర్కొన్నారు. ఎన్నికలకు ముందే సరేవ వివరాలు విడుదల చేస్తానని స్పష్టం చేశారు. 

Similar News