తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఎక్కడికక్కడే నేతలు పోలింగ్ సరళిని తెలుసుకుంటూ గ్రామాల్లో తిరుగుతున్నారు. ఈక్రమంలో హైదరాబాద్ నుంచి సిరిసిల్ల వెళ్తున్న కేటీఆర్కు.. సిద్దిపేట నుంచి వస్తున్న హరీష్రావుకు గుర్రాలగొంది గ్రామం వద్ద ఎదురుపడ్డారు. కేటీఆర్, హరీశ్ తమ వాహనాలను ఆపి పలకరించుకున్నారు. మంత్రి కేటీఆర్ ఆత్మీయంగా బావ కంగ్రాట్స్.. నీకు లక్ష మెజార్టీ ఖాయం అని సరదాగా వ్యాఖ్యానించారు. నీ దాంట్లో సగం మెజార్టీ అయినా తెచ్చుకుంటా.. సిరిసిల్ల పోతున్నా అని ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ఉత్సాహంగా జరుగుతోందని ఆనందం వ్యక్తం చేశారు.