కాళ్లు మొక్కనందుకే నాకు టికెట్ ఇవ్వలేదు...

Update: 2018-11-23 08:12 GMT

కెసిఆర్ పై మరోసారి విమర్శల కురిపించిన బీజేపీ అభ్యర్థి బొడిగే శోభ. కేవలం కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ఆయన కుటుంబ సభ్యుల కాళ్లు మొక్కనందుకే తనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని బొడిగే శోభ తెలిపారు. శుక్రవారం చొప్పదండి శోభ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆనాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావును నోటికి వచ్చినట్లు తిట్టి, విమర్శల వర్షం కురిపించానవారే నేడు రాజయోగం, పదవులు అనుభవిస్తున్నారని అన్నారు. అలాగే తెలంగాణ ఉద్యమంలో ముఖ్యభూమిక పోషించిన వాళ్లు తెలంగాణ ముద్దు బిడ్దలు, తెలంగాణ ఉద్యమకారులు గుర్తంచలేని ప్రభుత్వం తెరాస సర్కార్ అని మండిపడ్డారు. తెలంగాణలో ఉద్యమకారులు అణుచివేయబడ్డారు. కాగా తెలంగాణ రాష్ట్రంలో పదవులు, రాజభోగం అనుభవించుకుంటూ, పట్టపగలే దోచుకు తింటున్నది కల్వకుంట్ల కెసిఆర్ కుటుంభ సభ్యులే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చొప్పదండి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార భాగంగా మద్యం, డబ్బు వరదైపారుతుందని వెల్లడించారు. 

Similar News