యాదాద్రి భువనగిరి కాంగ్రెస్ లో వర్గవిభేదాలు భగ్గుమాన్నాయి. భువనగిరి పార్లమెంట్ పరిధి కాంగ్రెస్ సమీక్షా సమావేశంలో రసాబాసా నెలకొంది. నినాదాలు చేస్తూ రెండు వర్గాల నాయకులు హోరెత్తించారు. నియోజకవర్గ ఇంచార్జీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వర్గీయుల మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. అనిల్కుమార్ వర్గీయులకే ప్రాధాన్యమిస్తున్నారని కోమటిరెడ్డి వర్గానికి చెందిన నాయకులు ఆరోపిస్తూ నినాదాలు చేశారు.