టీఆర్ఎస్ లో చేరనందుకే బొడ్డుపల్లి శ్రీనివాస్ ను హత్య చేశారని ఆరోపించారు కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి. ఖచ్చితంగా శ్రీనివాస్ ది రాజకీయ హత్యేనని చెప్పారు. సీబీఐ విచారణ కోసమే కోర్టును ఆశ్రయించామన్నారు. సీఎం కేసీఆర్ హత్యా రాజకీయాలకు ప్రణాళికలు రచించుకుంటున్నారని కోమటిరెడ్డి చెప్పారు. శ్రీనివాస్ని సినిమా ఫక్కీలో హత్య చేశారని చెప్పారు. శ్రీనివాస్ హత్యకు ముందు, తర్వాత నిందితుల కాల్ డేటాను బయటపెట్టాలని పోలీసులను కోమటిరెడ్డి డిమాండ్ చేశారు.