తెలంగాణ కోసం కేసీఆర్ ఎవరితోనైనా కలుస్తా అనలేదా

Update: 2018-11-28 09:34 GMT

ఫాం హౌస్‌లో కాలం గడుపుతున్న సీఎం కేసీఆర్‌ను ఫాం హౌస్‌కే పరిమితం చేయాలని టీజేఎస్ అధినేత, ప్రజా కూటమి కన్వీనర్ కోదండరాం పిలుపునిచ్చారు. తెలంగాణ అభివృద్ధి కోసమే నాలుగు పార్టీలతో కూటమి ఏర్పాటు చేశామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ పాల్గొన్న కొడంగల్‌ సభలో అన్నారు. తెలంగాణ కోసం ఎవరినైనా కలుస్తాననన్న కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి కోసం తాము కూటమి కడితే తప్పు పట్టడం హాస్యాస్పదమని కోదండరాం ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి కొడంగల్‌ కొదమసింహమని టీజేఎస్ అధినేత కోదండరాం కొనియాడారు. కొడంగల్‌లో నిర్వహించిన బహిరంగసభలో కోదండరాం మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

Similar News