డిసెంబర్ 11 తరువాత కేసీఆర్‌ ఫాంహౌస్‌కే..

Update: 2018-12-03 08:58 GMT


సీఎం కేసీఆర్ అటు బీజేపీతో ఇటు ఎంఐఎంతో కలిసి నడుస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని సీపీఐ సీనియర్ నేత నారాయణ ఆరోపించారు. హైదరాబాద్ సిపిఐ కార్యలయంలో సీపీఐ సినియర్ నేత నారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ, టీఆర్ఎస్‌ల మధ్య నూటికి నూరు శాతం రహస్య అజెండా ఉందని ఆయన ఆరోపించారు.  ప్రధానమంత్రి నరేంద్రమోడీకి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో  కేసీఆర్‌ ఎటు ఉంటారో చెప్పాలంటూ ఆయన డిమాండ్ చేశారు. డిసెంబర్ 11 తరువాత కేసీఆర్‌ ఫాంహౌస్‌కే పరిమితం కావాల్సిందేనంటూ ఎద్దేవా చేశారు. దేశాన్ని కాపాడుదాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం అని పిలుపుమేరకు అందరిని కలుపుకొని  బీజేపీ వ్యతిరేక శక్తుల్ని అన్నింటిని ఏకతాటిపై తీసుకరావడం ద్వారానే దేశాన్నికాపాడాగలం అని అభిప్రాయానికి వచ్చామని దానికోసమే అందరం కృషి చేస్తున్నామని అందుకోసమే డిసెంబర్ 10 సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు. 

Similar News