తమిళనాడు అసెంబ్లీలో దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఫొటోను ఆవిష్కరించడం వివాదానికి దారి తీసింది. ఓ నిందితురాలి ఫొటోను అసెంబ్లీలో పెట్టడమేంటంటూ డీఎంకే ఎమ్మెల్యేలు అసెంబ్లీలో నిరసన తెలిపారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలిత ప్రధాన నిందితురాలని ఆమె చిత్రపటాన్ని అసెంబ్లీలో ఉంచడానికి వీల్లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో జయలలిత ఫొటోను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.