ఎమ్మెల్యే క్వార్టర్స్లోని రేవంత్ నివాసంలో కూడా ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఐటీ అధికారులు తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. అనంతరం ముగ్గురు అధికారులతో కూడిన బృందం సోదాలు చేపట్టింది. ఐటీ దాడుల నేపధ్యంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ నేత జానారెడ్డి రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. జూబ్లీహిల్స్లోని రేవంత్ నివాసానికి చేరుకున్న నేతలు తాజా పరిస్ధితిని సమీక్షించారు. స్ధానికంగా ఉన్న నేతలతో సోదాలకు సంబంధించిన విషయాలు అడిగి తెలుసుకున్నారు.