సుమారు ఆరు నెలలుగా ప్రజాసంకల్ప పాదయాత్రలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్, స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఎండ వేడిమి ఎక్కువగా ఉన్నప్పటికీ, ఆయన పాదయాత్ర కొనసాగిస్తున్నందున వడదెబ్బ తగిలిందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ వెల్లడించారు. ఆయన జలుబు, జ్వరం, తలనొప్పితో బాధపడుతున్నారని, అయినప్పటికీ, తన యాత్రను కొనసాగించారని తెలిపారు. మంగళవారం పాదయాత్ర ముగిసిన తర్వాత జగన్ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన వైద్యులు మూడు రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని ఆయనకు సూచించారు.