నేను వైసీపీలో చేరడం లేదు : టీడీపీ ఎంపీ

Update: 2018-12-10 04:29 GMT

గత కొంత కాలంగా విశాఖ జిల్లా అనకాపల్లి టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ వైసీపీలో చేరతారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 21న జగన్ పుట్టిన రోజు సందర్బంగా ఆయన వైసీపీ తీర్ధం పుచ్చుకుంటారని సామజిక మధ్యమాల్లో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. దాంతో నిన్న(ఆదివారం) ఈ విషయంపై అవంతి శ్రీనివాస్ స్పందించారు.. తాను టీడీపీని వీడుతున్నట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. అసలా.. అవసరం తనకు లేదని స్పష్టం చేశారు. అలాగే టీడీపీ నుంచి ఎవరు కూడా వైసీపీలో చేరబోరని జోస్యం చెప్పారు. 

Similar News