తిరుపతిలోని ప్రభుత్వ బాలికల వసతి గృహం సూపరిండెంట్ నందగోపాల్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వసతి గృహంలోని బాలికపై అత్యాచారం చేసినట్టు నిర్దారణ కావడంతో అరెస్ట్ చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. కడప జిల్లాకు చెందిన బాలిక వసతి గృహంలో ఉంటూ చదువుకుంటూ ఉండగా నందగోపాల్ అత్యాచారం చేశాడు. బాలిక గర్భవతి కావడంతో ఈ విషయం వెలుగుచూసింది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు వైద్య పరీక్షల అనంతరం 58 ఏళ్ల నందగోపాల్ను నిందితుడిగా చేర్చారు. పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.