తెలంగాణ ఎన్నికలతో జోరు మీదఉన్నారు తెలంగాణ ప్రజలు. అయితే ఎన్నికల దెబ్బకు మందు బాబులకు తీవ్రంగా దెబ్బతీసింది ఎలక్షన్ కమిషన్. నిన్న సాయంత్రం నుండి రేపు సాయంత్రం వరకు మద్యం బంద్ పెట్టింది దింతో మద్యం ప్రియులు ఒక్కసారిగా కంగుతిన్నారు. దింతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అయితే మాదాపూర్లోని సిటీ వైన్స్లో అతి చవగ్గా మద్యం లభిస్తోంది. అది కూడా ఎవరికి పడితే వారికి కాదు. ఇచ్చే నోటుకు సంబంధించిన సిరీస్ నెంబరు సరిపోలితేనే ఈ బంపర్ డిస్కౌంట్ వర్తిస్తుంది. రూ.10 ఇస్తే చాలు రూ.460 ఫుల్ బాటిల్ మద్యం. రూ.50 ఇచ్చారంటే రూ.600 మద్యం సీసా ఇస్తారు. మంచి మద్యం కావాలంటే రూ.100 ఇవ్వాలి అప్పుడు రూ.1000 మద్యం సీసా వస్తుందట అది కూడా ఎవరికి పడితే వారికి కాదు. ఇచ్చే నోటుకు సంబంధించిన సిరీస్ నెంబరు సరిపోలితేనే ఈ బంపర్ డిస్కౌంట్ వర్తిస్తుందట. అయితే గి ముచ్చట అనోట ఈనోట కాస్తా మాదాపూర్ పోలీసులకు తెలిసింది దింతో నిందితులను బుధవారం చాకచక్యంగా పట్టుకున్నారు. సిటీ వైన్స్ మేనేజరు ప్రవీణ్గౌడ్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఇన్స్పెక్టర్ వై.నాగేశ్వర్రావు వెల్లడించారు.