యాదాద్రికి పోటేత్తిన భక్తులు

Update: 2018-11-11 06:35 GMT

యాదాద్రి శ్రీ లక్ష్మీ నర్సింహాస్వామి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు భారీగా తరలి వచ్చారు. కార్తీక మాసం కావడంతో కొండపైన సత్యనారాయణ వ్రత మండపాలు, స్వామి వారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. కుటుంబ సమేతంగా లక్ష్మీ నర్సింహున్ని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి వారి ధర్మ దర్శనానికి 5 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. 

Similar News